అన్నమయ్య: గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం లో గాయాపడిన కానిస్టేబుల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.రాయచోటి అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వర్తించే 2011 బ్యాచ్‌ కానిస్టేబుల్‌ 2511 మల్లిఖార్జునకు, రాయచోటి ఎంజీ గార్డెన్‌ దగ్గర గురువారం రాత్రి ఎదురెదురుగా రెండు స్కూటర్లు ఢీ కొనడంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రికి రాయచోటి అర్బన్‌ ఇన్స్పెక్టర్‌ సుధాకర్‌ రెడ్డి తరలించారు. తిరుపతి నారాయణాద్రిఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కానిస్టేబుల్‌ మల్లిఖార్జున తుదిశ్వాస విడిచారు.మృతునికి భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. స్వగ్రామం గాలివీడు మండలంలోని అరవీడు పంచాయతీలోని ఎల్లంపల్లి. మల్లిఖార్జున మృతితోరాయచోటి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *