పొలం పిలుస్తోంది పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రామాపురం, సెప్టెంబర్ 23:-వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం రామాపురం మండలంలో నిర్వహించిన “ఇది మంచి ప్రభుత్వం” ప్రజాదర్బార్ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది పోస్టర్ను మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ…. రైతుల సంక్షేమమే తమ ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటానికి రాష్ట్ర ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం మరియు బుధవారాలు ఉదయం ఒక గ్రామం సాయంత్రం ఒక గ్రామంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 8:30 నుంచి 10:00 గంటల వరకు వ్యవసాయ క్షేత్ర సందర్శన, 10:00 నుంచి 12:00 గంటల వరకు గ్రామ సభ, అలాగే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు గ్రామసభ నాలుగు నుంచి 5:30 గంటల వరకు వ్యవసాయ క్షేత్ర సందర్శన చేయడం జరుగుతుందని రైతులు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను వ్యవసాయ అధికారులకు తెలియజేసి నూతన వ్యవసాయ పద్ధతులను పాటించి రైతులు అభివృద్ధి చెందాలన్నారు.
——————////————–
డివిజనల్ పిఆర్ఓ అన్నమయ్య జిల్లా

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *