మన దేశంలో 120 ఏళ్ల చరిత్ర ఉన్న టాప్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు రూ.3,000 మాత్రమే ఉందంటే నమ్ముతారా..? NIRF ర్యాకింగ్స్‌లో
టాప్‌లో ఉన్న ఆ ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్, తమిళనాడులోని వేలూర్‌లో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (CMC). ఈ వైద్య కళాశాల ప్రత్యేకతలు ఇదే

భారతదేశంలో మెడికల్ కోర్సులు చదవడం అంత ఈజీ కాదు. ప్రైవేట్‌ కాలేజీల్లో చదవాలంటే బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ కోర్సుల్లో ప్రవేశం పొందడం చాలా కష్టం. నీట్‌ (NEET) ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యి, టాప్ ర్యాంకు తెచ్చుకోవడం అందరికీ సాధ్యం కాదు. అందుకే చాలామందికి అడ్మిషన్ రాదు. లక్షలు పెట్టి టాప్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ సీటు తెచ్చుకోవడం చాలా కష్టం.

నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ప్రకారం, దేశవ్యాప్తంగా 386 ప్రభుత్వ, 320 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 1,06,333 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది 23 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ ఎగ్జామ్‌కి రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ . ప్రత్యేకమైనది

ఎంబీబీఎస్‌ కోర్సుకి అతి తక్కువ ఫీజు:

క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి మంచి పేరుంది. ఇక్కడ MBBS కోర్సుల ఫీజులు చాలా తక్కువ. నివేదికల ప్రకారం, ఇక్కడి విద్యార్థులకు యాన్యువల్‌ ట్యూషన్ ఫీజు రూ.3,000 మాత్రమే. మొదటి సంవత్సరంలో అడ్మిషన్ సమయంలో రూ.8,800 చెల్లించాలి. యాన్యువల్ ఫీజు రూ.15,105, వన్-టైమ్ పేమెంట్‌ రూ.13,425 చెల్లిస్తే సరిపోతుంది.

ఏటా 2,600 మందికి అడ్మిషన్:

క్రిస్టియన్ మెడికల్ కాలేజీని 1900లో డాక్టర్ ఇడా సోఫియా స్కడర్ స్థాపించారు. ఆమె భారతదేశంలో పనిచేసిన, యునైటెడ్ స్టేట్స్‌లోని డచ్ రిఫార్మ్డ్ చర్చ్‌కు చెందిన మెడికల్ మిషనరీస్‌ కూతురు. డాక్టర్ స్కడర్ 1900లో వెల్లూరులో సింగిల్ బెడ్ డిస్పెన్సరీ ప్రారంభించారు. 1902 నాటికి మహిళల కోసం 40 పడకల మేరీ టాబర్ షెల్ మెమోరియల్ హాస్పిటల్‌ను నిర్మించారు.

ఈ కాలేజీలో మెడికల్, నర్సింగ్, అనుబంధ రంగాల్లో 175 కంటే ఎక్కువ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది. పీహెడీ కూడా చేయవచ్చు. అన్ని కోర్సులకు కలిపి ప్రతి సంవత్సరం 2,600 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకుంటారు. అందులో 100 మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సు MBBSలో ప్రవేశం పొందుతారు. ఈ కాలేజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందింది.

ఓరు…నిముషం:
సొసైటీ ట్రస్ట్ చట్టాలకు లోబడి విద్యాసంస్థలను రిజిస్ట్రేషన్ చేసుకుని “సమాజ విద్యా సేవ” చేస్తామని .. ప్రభుత్వ రాయితీలు… ఇన్కమ్ టాక్స్ రాయితీలు… పొందుతూ…. ఫీజుల దోపిడీ…. మరో వంక విద్యావ్యవస్థనే సర్వనాశం… చేయడమే కాక … జలగల్లాగా విద్యార్థి తల్లిదండ్రు లను.. పీక్కు తింటూ….అనతి కాలములోనే వేల రూపాయల కోట్ల రూపాయలు అర్జించిన విద్యా వ్యాపార యాజమాన్యాలు…
ఇక్కడ వీరు చేసే సమాజసేవ చాలదన్నట్టు…. శాసనాలు చేసే… మంత్రులు‌… యం.పీలు …ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ప్రజాసేవ నాయకులు కీర్తింపబడుతు…… ద్రోహతలంపుతో…ప్రభుత్వ రంగ వ్యవస్థలో ప్రభుత్వ పాత్రను తగ్గించి … నిర్వీర్యం చేస్తున్న ఈ విద్యా వ్యాపార యాజమాన్య నాయకులు… వీరిచ్చే… చందాలతో… కొన్ని ప్రతిపక్ష పార్టీలు నడుపుతున్న వీరు….. ఉన్న కాలంలో దేశంలో ఇటువంటి విద్యా సంస్థలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *