హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు అందజేయాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢల్లీి: రాజమండ్రి జైలులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ ను మంగళవారం జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహాత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సిద్దార్ద లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, మను సింఫ్వీు కూడా వాదనలు వినిపించారు. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *