న్యూ ఢల్లీి: ఒకే దేశం ఒకే ఎన్నికలు మోదీ చిరకాల స్వప్నం ఈ విధానంపై అధ్యయనం చేయటానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవిద్‌ కమిటీ నివేదికకు. కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలను ఒకేసారి నిర్వహించటానికి ఈ కమిటీ చేసిన సిఫార్సులను మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో జమిలీ ఎన్నికల వన్‌ నేషన్‌R వన్‌ ఎలక్షన్‌, బిల్లుకు సెంట్రల్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో లోక్‌ సభ, రాజ్య సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపి చట్టరూపం దాలిస్తే. దేశంలో 100 రోజుల్లోనే లోక్‌ సభ, అసెంబ్లీ, లోకల్‌ బాడీ ఎన్నికలు జరగనున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *