రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో వచ్చిన నిధులకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెలువరించిన రెండు జాబితాలు దేశంలో ఇంకా కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేయడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దిగివచ్చింది. అస్పష్టంగా వివరాలు వెల్లడిరచింది. ఆ వివరాల ప్రకారం.. వివిధ రాజకీయ పార్టీల బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల చరిత్ర లోప భూయిష్టంగా ఉంది. నిధులు ఇచ్చిన వాటిలో చాలా కంపెనీలు పలు రకాల ఆరోపణలు ఎదుర్కొన్నవే ఉన్నాయి. వాస్తవానికి ఆరోపణలు ఉన్న కంపెనీలే అధిక బాండ్లు కొనుగోలు చేయడం.. ఆస్తులు అటాచ్‌ చేసిన వెంటనే బాండ్లు కొనుగోలు చేయడం.. అనుమానాలకు తావిస్తోంది.గేమింగ్‌ సంస్థ రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తోంది. ఈ సంస్థ గత ఐదు సంవత్సరాలలో 1368 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఈ పార్టీ ఇప్పటివరకు బాండ్లను ఏ పార్టీకి ఇచ్చిందనే వివరాలు తెలియ రాలేదు. ఈ సంస్థ ప్రధానంగా లాటరీ వ్యాపారం చేస్తుంది.. 2019లో ఈ సంస్థపై ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ ఏడాది జూలై నెలలో ఈ సంస్థకు చెందిన 250 కోట్ల ఆస్తులను ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అధికారులు అటాచ్‌ చేశారు. 2022 ఏప్రిల్‌ 2న మరో 409.92 కోట్ల ఆస్తులనూ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అధికారులు అటాచ్‌ చేశారు. ఇది జరిగిన ఐదు రోజులకే అంటే ఏప్రిల్‌ 7న ఈ సంస్థ 100 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ప్రధాన కంపెనీలతో పాటు అనుబంధ కంపెనీల ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు ఆ సంస్థ రూ.2,318 కోట్లను విరాళాలుగా ఇచ్చింది. అయితే ఆ పార్టీలు పూర్తిగా అధికార పార్టీలే. బీజేపీ, బీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీ, డీఎంకే వంటి పార్టీలకు విరాళాలు ఇచ్చింది. ఈ కంపెనీకి అంత భారీ నెట్‌ వర్క్‌ వ్యాపారం ఉంది. పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తూ ఉంటుంది. కృష్ణా రెడ్డికి చెందిన మేఘా గ్రూప్‌ అనేక కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టులను పొందింది. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ పథకంలో విస్తృతమైన అవకతవకలను కాగ్‌ ఎత్తిచూపింది. ఖజానాకు స్పష్టమైన నష్టం కలిగించిందని గుర్తించింది. రాష్ట్ర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, ముఖ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుతో రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం పై అనేక గుసగుసలు ఉన్నాయి. అయితే ఒక్క కాళేశ్వరం కాదు.. మేఘా కంపెనీ తెలంగాణ బయట కూడా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 14,400 కోట్ల థానే`బోరివలి ట్విన్‌ టన్నెల్‌ ప్రాజెక్ట్‌ను కూడా చేపట్‌?టంది. ప్రాజెక్ట్‌ కోసం అతి తక్కువ బిడ్డర్‌గా అవతరించింది, ఆశ్చర్యకరంగా తక్కువ బిడ్‌కు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నుండి ప్రశంసలు పొందింది. మేఘా గ్రూప్‌ రేడియో రిలే కంటైనర్‌లను సరఫరా చేయడానికి రూ. 500 కోట్ల విలువైన రక్షణ ప్రాజెక్టును కూడా గెలుచుకుంది . ఇక దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇన్‌ ఫ్రా ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ సంస్థ చేపట్టేవి అత్యధికం ప్రభుత్వ ప్రాజెక్టులు. ఒలెక్ట్రా పేరుతో ఎలక్ట్రిక్‌ బస్సులను మేఘాగ గ్రూప ?తయారు చేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలక్టోరల్‌ బాండ్ల డేటా ఎంఈఐఎల్‌ కి చెందిన మరో కంపెనీ, వెస్ట్రన్‌ యుపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ కూడా భారీగా విరాళాలు అందించినట్లు రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వెస్ట్రన్‌ యుపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ లిమిటెడ్‌, ఎలక్టోరల్‌ బాండ్‌ల కొనుగోలుదారుల్లో ఏడవ స్థానంలో ఉంది. ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ అంతటా ట్రాన్స్‌మిషన్‌ లైన్లను వేస్తున్న పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ. 220 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసింది. మరో రెండు మేఘా గ్రూప్‌ కంపెనీలు, ఎస్‌ఈపిసి పవర్‌ , ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏప్రిల్‌ 2019 , జనవరి 2024 మధ్య ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ. 40 మరియు రూ. 6 కోట్లు విరాళంగా అందించాయి. మేఘాతరపున ఇ?చచే విరాళాలు అధికార పార్టీలకే ఎక్కువ ఉంటాయి. ఆయన ఇచ్చిన విరాళంలో అధిక మొత్తం బిజేపీ, బీఆర్‌ఎస్‌, వైసీపీ లకే అందింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా మాత్రమే కాకుండా.. ప్రూడెంట్‌ ఫండ్‌ ద్వారా కూడా రాజకీయ పార్టీలకు విరాళం ఇస్తున్నారు. మేఘా కంపెనీ వ్యవస్థాపకుడు పి.పిచ్చిరెడ్డి. పీపీ రెడ్డిగా ప్రసిద్ధుడు. రైతు బిడ్డగా వ్యాపారంలోని ప్రవేశించిన పీపీ రెడ్డి తొలినాళ్లలో ప్రభుత్వానికి చెందిన చిన్నచిన్న కాంట్రాక్ట్‌ వర్కులను నిర్వహించేవారు. 1989 కాలంలో మెగా ఇంజినీరింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించారు. అప్పట్లో చిన్న పట్టణాల్లో పైపుల నిర్మాణాలను కంపెనీ చేపట్టేది. ఆ తరువాతి కాలంలో కంపెనీ రోడ్ల నిర్మాణం, డ్యామ్స్‌, సహజ వాయువు, విద్యుత్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, మెగా ఇంజనీరింగ్‌ వర్క్స్‌ వంటి అనేక ఇతర రంగాల్లోకి విస్తరించింది. అలా మౌలిక సదుపాయాల నిర్మాణ రంగంలో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా నిర్మించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.2006లో మెగా ఇంజనీరింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరును.. ఇంజనీరింగ్‌ డ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌గా మార్చారు. పీపీ రెడ్డి అల్లుడు పీవీ కృష్ణారెడ్డి 1991లో జతకట్టి కంపెనీని ముందుకు తీసుకెళ్లటంలో కీలకంగా వ్యవహరించారు. దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిన తెలంగాణలోని అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ను విజయవంతంగా నిర్మించింది. ప్రపంచం క్లీన్‌ ఎనర్జీ వైపు నడుస్తున్న తరుణంలో మెగా ఆధ్వర్యంలోని జాయింట్‌ వెంచర్‌ అయిన ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీలో అగ్రగామిగా నిలిచింది. వీటి తయారీలో చైనా బీవైడీ నుంచి సాంకేతికతను కొనుగోలు చేసింది. అనేక రంగాల్లోకి విస్తరించిన మెగా ఇంజనీరింగ్‌ డ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ ఇతర సబ్సిడరీ కంపెనీలను సైతం కలిగి ఉంది. మెగా ఫైబర్‌ గ్లాస్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఎంఈఐఎల్‌ గ్రీన్‌ పవర్‌ లిమిటెడ్‌, వెస్ట్రన్‌ యుపి పవర్‌ ట్రాన్స్మిషన్‌ కో. లిమిటెడ్‌, ఎస్‌ఈపిసి పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేసీఈ ఇంజనీరింగ్‌ డ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎంఈఐఎల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ఎంఈఐఎల్‌ ఫౌండేషన్‌ ఉన్నాయి. 36 ఏళ్ల కిందట కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం అత్యుత్తమమైన, ప్రతిష్ఠాత్మకమైన నిర్మాణాలను చేపడుతోంది. మనదేశంలో 16 రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు విస్తరించి వున్నాయి. అంతేకాక భారత ఉపఖండం దాటి 10 దేశాల్లో కూడా తమ సత్తా చూపింది మేఘామేఘా కంపెనీ ఎన్ని ప్రాజెక్టులు చేపట్టినా అంతకు మించిన వివాదాలనూ ఎదుర్కొంటోంది. అధికార పార్టీలకో కుమ్మక్కు అయి భారీ కాంట్రాక్టులు తీసుకుని క్విడ్‌ ప్రో కో కింద వారికి డబ్బులు చెల్లిస్తోందని అంటున్నారు. అధికార పార్టీలకు అదీ కూడా.. కాంట్రాక్టులు పొందిన తర్వాతే విరాళాలు ఇచ్చినట్లుగాబ యటకు రావడమే దీనికి సంకేతం. అదీ కూడా రెండు వేల కోట్లకుపైగా విరాళిలివ్వడంతో అందరి దృష్టి మేఘాపై పడిరది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *