మార్చి 12 ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడిరచాలని కోర్టు ఆదేశం
న్యూఢల్లీి మార్చ్ 11: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడిరచేందుకు మరింత అదనపు గడువు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన అభ్యర్థనను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. రేపటిలోగా(మార్చి 12) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడిరచాలని కోర్టు ఇవాళ తన తీర్పులో ఆదేశించింది. ఎస్బీఐ ఇచ్చిన సంకేతాల మేరకు బ్యాంకు వద్ద కావాల్సినంత సమాచారం ఉందని అర్థమవుతోందని కోర్టు తెలిపింది. జూన్ 30వ తేదీ వరకు పొడిగింపు ఇవ్వాలని పెట్టుకున్న పిటీషన్ను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. మార్చి 12 లోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడిరచాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మార్చి 15వ తేదీన సాయంత్రం 5 గంటల లోగా ఈసీ తమ వెబ్సైట్లో ఆ బాండ్ల వివరాలను పొందుపరుచాలని కోర్టు ఆదేశించింది.