దేశంలో తలసరి ఆదాయం భారీగా రికార్డయింది. ప్రజల ఖర్చు అలవాట్లు మారుతున్నాయి గ్రామాల నుంచి నగరాల వరకు నిత్యావసర వస్తువులపై వ్యయం పెరుగుతోంది. ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిరదని ‘నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సంస్థ పేర్కొంది. మొత్తం దేశ జనాభా సగటును పరిశీలిస్తే, 2011 12తో పోలిస్తే 2022 23 నాటికి వారి నెలవారీ వినియోగదారుల వ్యయం దాదాపు రెట్టింపు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత ధరల ప్రకారం దేశంలోని కుటుంబాల తలసరి సగటు నెలవారీ గృహ వ్యయం 2022 23లో రూ.6,459గా ఉంటుందని అంచనా. కాగా 2011 12లో రూ.2,630. అదే విధంగా గ్రావిూణ ప్రాంతాల్లో దశాబ్దం క్రితం రూ.1,430గా ఉన్న రూ.3,773కి పెరిగింది.అయితే, నగరాలతో పోల్చితే గ్రావిూణ ప్రాంతాల్లో నివసించే పేదలకు రోజువారీ ఖర్చులు చాలా తక్కువ అని ఇటీవల నిర్వహించి సర్వేలో వెల్లడైంది. గ్రామంలోని పేదల జీవితం రోజుకు రూ.45 మాత్రమే ఖర్చు అవుతుండగా, నగరంలో నివసించే అత్యంత పేద వ్యక్తి రోజుకు రూ.67 ఖర్చు చేయగలుగుతున్నాడు.నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఇటీవల నెలవారీ సగటు తలసరి వినియోగదారు వ్యయం డేటాను విడుదల చేసింది.ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జాతీయాదాయం అంటారు. జాతీయాదాయంలో పెరుగుదల సంభవిస్తే దానిని అభివృద్ధికి సూచికగా భావించవచ్చు. జాతీయాదాయంలో పెరుగుదల రెండు కారణాల వల్ల సంభవించవచ్చు. అవి. ఉత్పత్తిలో పెరుగుదల, ధరల స్థాయిలో పెరుగుదల. అయితే, నామ మాత్రపు జాతీయాదాయంలో పెరుగుదలను అభివృద్ధికి సూచికగా భావించడం సరికాదు. వాస్తవ జాతీయాదాయంలో పెరుగుదలను అభివృద్ధికి సూచికగా భావించడం ఉత్తమం. ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల సగటు వార్షిక ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. జాతీయాదాయాన్ని జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం తెలుస్తుంది. జాతీయాదాయంలో పెరుగుదల కంటే తలసరి ఆదాయంలో పెరుగుదలను అభివృద్ధికి మేలైన సూచికగా భావించవచ్చు. తలసరి ఆదాయంలో పెరుగుదల అభివృద్ధికి సూచికే. కానీ ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం పెరిగితే అభివృద్ధికి సూచికగా భావించడం సమంజసం కాదు. అందుకే వాస్తవ తలసరి ఆదాయంలో పెరుగుదలను అభివృద్ధికి మేలైన సూచికగా భావించవచ్చు. ఈ గణాంకాలు గృహ వినియోగ వ్యయ సర్వే 2022 23 పై ఆధారపడి ఉన్నాయి. దీని ప్రకారం, గ్రామంలో అత్యల్ప స్థాయిలో నివసిస్తున్న 5 శాతం జనాభా సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం రూ.1,373 మాత్రమే. దీని ప్రకారం, ఇది రోజుకు రూ.45 వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది. పట్టణ జనాభా డేటాను పరిశీలిస్తే, నగరాల్లో నివసిస్తున్న పేదలు 5 శాతం జనాభాలో ప్రతి వ్యక్తి సగటు నెలవారీ ఖర్చు రూ. 2001. రోజువారీ ప్రాతిపదికన, ఈ ఖర్చు దాదాపు రూ.67 వరకు వస్తుంది.ూఅఇూ ఫ్యాక్ట్ షీట్ ఆధారంగా, గ్రామాలు, నగరాల్లోని ధనవంతులలో టాప్ 5 శాతం ఉన్న వ్యక్తులతో పోల్చినట్లయితే, గ్రామంలో వారి తలసరి నెలవారీ సగటు వినియోగదారు వ్యయం రూ. 10,501 (రోజుకు రూ. 350). పట్టణ ప్రాంతాల్లోని టాప్ 5 శాతం ప్రజల సగటు నెలవారీ వినియోగదారు వ్యయం రూ. 20,824 (రోజుకు రూ. 695).ఈ వృద్ధిని పరిశీలిస్తే, గ్రావిూణ జనాభా సగటు నెలవారీ గృహ వ్యయంలో 164 శాతం పెరుగుదల నమోదైంది. అయితే పట్టణ జనాభా వ్యయంలో ఈ పెరుగుదల 146 శాతంగా ఉంది. ఔూూూ సాధారణంగా ఈ గణాంకాలను ప్రతి 5 సంవత్సరాలకు విడుదల చేస్తుంది. పదేళ్ల వ్యవధిలో ఈసారి ఈ గణాంకాలు వెలువడ్డాయి.2023`24 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 2,42,479 కోట్లుగా ప్రభుత్వం తేల్చింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వం సిద్ధం చేసింది. గతేడాది కన్నా 2023`24 ఆర్థిక సంవత్సరంలో 10.28 శాతం వృద్ధి నెలకొన్నటు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇంతలా పెరగడానికి కారణాలను మాత్రం విశ్లేషించలేదు. అయితే ఇంత భారీగా తలసరి ఎలా పెరుగుతోందో అర్థం కావడం లేదని పలువురు అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. 2016`17 ఆర్థిక సంవత్సరానికి కేవలం 1,0,676 రూపాయల తలసరి ఆదాయం ఉండగా, 2019`20 నాటికి 1,60,341 రూపాయలకు చేరింది. 2021`22లో స్వల్పంగా మాత్రమే తలసరి ఆదాయం పెరిగినట్లు చూపించగా, ఆ తరువాత సంవత్సరాల నుంచి ఒక్కసారిగా భారీగా పెరుగుదల చూపించడం విశేషం. అక్కడి నుంచి వరుసగా 17.45 శాతం, 11.49 శాతం, 10.28 శాతంగా తలసరి పెరిగినట్లు అధికారులు పేర్కొనడం విశేషం. ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాల ద్వారానే ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్న ప్రణాళిక శాఖ అధికారులు, అదే సమయంలో భారీగా పెరుగుతున్న ఖర్చులను విస్మరించి తలసరిని గణిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి