కృత్రిమ మేథ.. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌. దీని ప్రభావం ప్రపంచంపై బాగానే పడుతోంది. ఇప్పుడిప్పుడే.. ప్రవేశిస్తున్న ఈ అత్యంత అధునాతన సాంకేతిక వ్యవస్థ ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రవేశించింది. రాబోయే కాలమంతా దీనిదే అంటున్నాయి సర్వేసంస్థలు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్‌ వంటి వాటిలో రానున్న మూడేళ్ల కాలంలో అంటే 2027 నాటికి భారీగా వృద్ధి చెందుతుందని నాస్‌కామ్‌ అంచనా వేసింది. సాధారణంగా కృత్రిమ మేథ అంటే.. ఇటీవల కాలంలోకొంత ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దీనివల్ల ఊడిపోతున్న ఉద్యోగాలు సహా.. మనిషి కన్నా.. 100 రెట్లు ఎక్కువగా ఆలోచన చేస్తుందని.. ఫలితంగా ఇది చెడుకు దారితీస్తుందని మేధావులు సైతం చెప్పుకొచ్చారు. అయితే.. ఏ వ్యవస్థలో అయినా.. మంచి, చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు కృత్రిమ మేథలోనూ ఈ రెండు ఉన్నాయనే చెబుతున్నారు. కృత్రిమ మేధ ఆధారిత సేవల మార్కెట్‌ భారత్‌ఏటా 25`35% వృద్ధిని సాధిస్తుందని నాస్‌కామ్‌ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా 2027 నాటికి ఏఐ మార్కెట్‌ దేశీయంగా 17 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.41 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని వివరించింది. టెక్నాలజీ బడ్జెట్‌ కేటాయింపులు పెరగడం, మానవ వనరుల లభ్యత, ఏఐ సేవలకు ప్రాధాన్యం పెరుగుతుందని విశ్లేషించింది. ‘ఏఐ పవర్డ్‌ టెక్‌ సర్వీసెస్‌’ పేరుతో ఈ నివేదికను కన్సల్టింగ్‌ సేవల సంస్థ అయిన బీసీజీతో కలిసి నాస్‌కామ్‌ ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ రంగంలోకి పెట్టుబడులు ఏటా 24% పెరుగుతున్నాయి. 2023లో 83 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.89 లక్షల కోట్ల) పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించింది. ప్రధానంగా డేటా అనలిటిక్స్‌, జెన్‌ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, ఆల్గోరిధమ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ విభాగాల్లోకి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయిమనదేశంలో ఐటీ కంపెనీలు డిజిటల్‌ కంటెంట్‌, డేటా అనలిటిక్స్‌ సప్లై చైన్‌ రంగాలకు నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కేవలం ఏఐని వినియోగించడమే కాదు.. తమ సేవల తీరును సరికొత్తగా మారుస్తున్నాయి. మన దేశంలో 4.2 లక్షల మంది ఏఐ నిపుణులు ఉన్నారు. ఏటా ఈ నిపుణుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి`5 దేశాల జాబితాలో మనదేశం ఒకటి. ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నందున, ఏఐ నిపుణుల అవసరాలు పెరుగుతాయని నాస్‌కామ్‌ వెల్లడిరచింది. నిపుణుల సంఖ్య ఏటా 15% పెరగాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొంది. దీన్ని పరిగణనలోకి తీసుకునే, ఐటీ కంపెనీలు తమ సిబ్బందిలో ఏఐ నైపుణ్యాలు పెంపొందించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు వచ్చే మూడేళ్లలో బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్ల)కు పైగా నిధులు ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నాయి.ఏఐ పరిజ్ఞానంతో ఐటీ కంపెనీలు తమ వినియోగదార్లకు కొత్త సేవలు ఆవిష్కరించడంతో పాటు అదనపు విలువను జోడిరచగలుగుతున్నాయని నాస్‌కామ్‌ ప్రెసిడెంట్‌ దేబ్‌జానీ ఘోష్‌ వివరించారు. ఏఐ వినియోగంలో భద్రత, నైతిక విలువలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. లేకపోతే.. మంచి కన్నా.. చెడుకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి. మరో వైపుప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ కొత్త అవకాశాలను అందిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మాత్రం ప్రజలను భయపెడుతుంది. ఏఐ వల్ల ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఏఐను సరిగ్గా నిర్వహిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏఐపై పెద్దస్థాయిలో పరిశోధనలు సాగుతున్నాయి. కానీ ఇటీవల ఓ వార్త మాత్రం ఏఐ వల్ల కలిగే నష్టాలను వివరిస్తుంది. ముఖ్యంగా ఏఐను నియత్రించే అవకాశం మానవులకు ఉండదని, అదే జరిగితే మానవ మనుగడకే ఏఐ వల్ల ముప్పు సంభవిస్తుందని పేర్కొంటున్నారు. ప్రఖ్యాత ఏఐ భద్రతా నిపుణుడు డాక్టర్‌ రోమన్‌ వీ యాంపోలిస్కీ తన రాబోయే పుస్తకం ఏఐ అన్‌ఎక్స్‌పాండబుల్‌, అన్‌ ప్రిడిక్టబుల్‌, అన్‌ కంట్రోలబుల్‌ అనే పుస్తకంలో ఏఐ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ పుస్తకం కృత్రిమ మేధస్సు ద్వారా ఎదురయ్యే సంభావ్య ప్రమాదాల గురించి తెలియజేస్తుంది. ప్రస్తుత సాంకేతికత దాని సురక్షితమైన, నైతిక ఉపయోగాన్ని నిర్ధారించడానికి రక్షణగా లేదని డాక్టర్‌ యాంపోలిస్కీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యాంపోలిస్కీ రచించిన పుస్తకంలో ఏఐ వల్ల కలిగే నష్టాలను ఓ సారి తెలుసుకుందాం.డాక్టర్‌ యాంపోలిస్కీ ఏఐకు సంబంధించిన విస్తృతమైన పరిశోధన ఈ పుస్తకంలో ప్రచురించారు. మానవ సామర్థ్యాలను అధిగమించిన తర్వాత సూపర్‌`ఇంటెలిజెంట్‌ ఏఐను మనం నియంత్రించగలమనే కచ్చితమైన రుజువు లేదని పేర్కొంటున్నారు. ఈ ‘‘అస్తిత్వ ముప్పు’’ అతను దానిని పిలుస్తున్నట్లుగా పెద్దదిగా ఉంది. తనిఖీ చేయకుండా వదిలేస్తే వినాశకరమైన పరిణామాలకు అవకాశం ఉంది. ఈ పుస్తకంలో ఏఐకు సంబంధించిన స్వయంప్రతిపత్తి, అనూహ్యత ద్వారా ఎదురయ్యే స్వాభావిక సవాళ్లను వివరించారు. ఈ ఫీచర్లు అపారమైన సామర్థ్యాన్ని అందిస్తున్నప్పుడు ఏఐ మానవ నియంత్రణలో ఉందని నిర్ధారించడం కష్టతరం చేస్తుందని పేర్కొంటున్నారు. డాక్టర్‌ యాంపోలిస్కీ సందేశం స్పష్టంగా, అత్యవసరంగా ఉందని పలువురు టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బలమైన ఏఐ భద్రతా చర్యలను అభివృద్ధి చేయాలని కూడా సూచిస్తున్నారు. ఏఐ వ్యవస్థలను తనిఖీ చేయని స్వయంప్రతిపత్తితో పనిచేయడానికి అనుమతించే ముందు మానవ నియంత్రణ, అవగాహనకు ప్రాధాన్యతనిచ్చే సమతుల్య విధానం అమలు చేయాలని యాంపోలిస్కీ చెబుతున్నారు. ముఖ్యంగా ఏఐను మానవాళి ఎదుర్కోబేయే అతి ముఖ్యమైన సమస్యగా చాలామంది భావించవచ్చని ఆయన పేర్కొంటున్నారు. అయితే ఏఐ పెరుగుదల అనేది ప్రపంచంలో కొత్త సమస్యలను కారణం అవుతుందని చెబుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *