వంశపారంపర్య రాజకీయాల వల్ల ఎక్కువగా నష్టపోయింది యువతనే
కుటుంబ రాజకీయాలపై మండిపడ్డ మోదీ..
32 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
జమ్మూ కశ్మీర్‌ ఫిబ్రవరి 20:జమ్మూ కశ్మీర్‌లో ఈరోజు 32 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ కుటుంబ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ అనేక దశాబ్దాలుగా రాజవంశ రాజకీయాల బాధితురాలిగా ఉందన్నారు. వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న వారు తమ ప్రయోజనాల కోసం మాత్రమే చూసుకున్నారు తప్ప విూ ప్రయోజనాలను పట్టించుకోలేదని పేర్కొ?న్నారు. వంశపారంపర్య రాజకీయాల వల్ల ఎక్కువగా నష్టపోయింది యువతేనని వెల్లడిరచారు. తమ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తులు విూ కుటుంబం గురించి చింతించరని చెప్పారు.ఆర్టికల్‌ 370ని ప్రధాని మోదీ గోడతో పోల్చారు. ఆ గోడను బీజేపీ ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌ సమతుల్య అభివృద్ధి దిశగా కొనసాగుతోందన్నారు. ఈరోజు వందలాది మంది యువతకు ప్రభుత్వ నియామక పత్రాలు అందజేశామని మోదీ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌ ఈ వంశపారంపర్య రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందన్న సంతృప్తి ఉందన్నారు.జమ్మూకశ్మీర్‌ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం భారీ కానుకలు అందించారు. సంగల్దాన్‌ స్టేషన్‌` బారాముల్లా స్టేషన్‌ మధ్య మొదటి ఎలక్ట్రిక్‌ రైలును ప్రధాని ప్రారంభించారు. బనిహాల్‌`ఖరీ`సుంబాద్‌`సంగల్దాన్‌ (48 కి.విూ) కొత్తగా విద్యుద్దీకరించబడిన బారాముల్లా`శ్రీనగర్‌`బనిహాల్‌`సంగల్దాన్‌ సెక్షన్‌ (185.66 కి.విూ) మధ్య కొత్త రైలు మార్గంతో సహా జమ్మూ, కాశ్మీర్‌లో వివిధ రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.ఎంఏ స్టేడియంలో పదేళ్ల క్రితం డిసెంబర్‌ 2013లో జమ్మూలోని ఇదే స్థలంలో లాల్కర్‌ ర్యాలీని ఉద్దేశించి ఇచ్చిన హావిూలను గుర్తు చేశారు. జమ్మూలో కూడా ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థలు ఎందుకు నిర్మించలేరని అప్పుడు ప్రశ్నించామని…ఇప్పుడు ఆ హావిూలను నెరవేర్చామని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్మించామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్రానికి చెందిన రెండు ఎయిమ్స్‌, ఐఐటి, ఐఐఎంలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్‌లో సామాజిక న్యాయం కొత్త అధ్యాయం ప్రారంభమైంది. గుజ్జర్లు, పహారీలు, ఎస్టీలు, ఎస్సీలు, కాశ్మీరీ పండిట్లు, పశ్చిమ పాకిస్తాన్‌ నుంచి వచ్చిన శరణార్థులు రాష్ట్రంలో తమ హక్కులను పొందారని గుర్తు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *