విజయవాడ, నవంబర్‌ 18:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు తాగకుండానే కిక్‌ ఇచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూపాయల్లో విధించే పన్నును శాతాల్లోకి మారుస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడిరచారు. ట్యాక్స్‌ను సవరించాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అన్ని మద్యం బ్రాండ్లపై ఒకే రకమైన భారం పడుతుంది. క్వార్టర్‌ సీసాపై రూ. 10, ఫుల్‌ బాటిల్‌పై రూ. 20 పెంచుతూ ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానంతో కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధరలు తగ్గుదల కనిపించింది. అయితే అవి ఇక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేయకపోవడం వల్ల వాటి ధరలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు అధికారులు.ప్రస్తుతం వ్యాట్‌ వసూళ్లలో మార్పులు తీసుకురావడం వల్ల తరచూ విక్రయించే బ్రాండ్లపై కొంత భారం పడిరది. క్వార్టర్‌ బాటిల్‌పై రూ. 10`40 వరకూ, హాఫ్‌ బాటిల్‌పై రూ. 10`50 వరకూ, ఫుల్‌ బాటిల్‌పై రూ. 10`90 వరకూ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మద్యం బాటిళ్లపై ఉన్న ఐఎంఎఫ్‌ఎల్‌ ఆధారంగా పన్నుల శాతాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఐఎంఎఫ్‌ఎల్‌ కనీస ధర రూ. 2,500 లోపు ఉంటే దానిపై 250శాతం, రూ. 2,500 దాటితే దానిపై 150శాతం పన్నులు విధించినట్లు తెలిపారు. ఇక బీరుపై 225%, వైన్‌పై 200%, విదేశీ మద్యంపై 75% ఎఆర్‌ఈటీ ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ బ్రాండ్ల పై ఉన్న ధరలను చాలా కాలంగా పెంచలేదని, వాటి రవాణా, ఇతర ఖర్చుల ఆధారంగా ప్రస్తుతం పెంచామని వివరించారు.గతంలో 180ఎంఎల్‌ లిక్కర్‌ సీసా ధర రూ. 150 కాగా ప్రస్తుతం అలాగే ఉంది. అయితే 750 ఎంఎల్‌ మద్యం బాటిల్‌ ధర గతంలో 800 కాగా ఇప్పుడు కూడా అలాగే స్థిరంగా ఉంది. కొన్ని 180ఎంఎల్‌ లిక్కర్‌ బ్రాండ్ల పై రూ. 200 నుంచి రూ. 210 పెరిగింది. అంటే రూ. 10 అదనంగా చెల్లించాలి. కొన్ని 750 ఎంఎల్‌ లిక్కర్‌ సీసా ధర గతంలో రూ. 4330 ఉండగా ప్రస్తుతం రూ. 5450కి పెరిగింది. అంటే.. రూ. 1120 పెరిగిందన మాట. ఇలా కొన్నింటిపై ట్యాక్స్‌ ప్రభావం పడితే.. మరి కొన్నింటిపై స్థిరంగా కొనసాగుతోంది.మద్యంపై విధించే అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ంఖీఇు)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది ఏపీ ఎక్సైజ్‌ శాఖ. ఏఆర్‌ఈటీ శ్లాబులు రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవు. కనుక… అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చింది ఎక్సైజ్‌ శాఖ. దీని వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై పన్నుల భారం ఒకేలా పడనుంది. అంతేకాదు… కొన్ని మద్యం బ్రాండ్లపై ధరలు కూడా తగ్గాయి. ఐఎంఎఫ్‌ఎల్‌ (ఎఓఈఒ) కనీస ధర 2వేల 500 రూపాయల లోపు ఉంటే దానిపై 250 శాతం పెరిగింది. 2వేల 500 రూపాయలు దాటితే 150 శాతం పెరిగింది. ఇక బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం ధరలు పెరిగాయి. ఫారిన్‌ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ పెరిగింది. దీనికి బట్టి… ఒక ఫుల్‌ బాటిల్‌ ప్రస్తుతం 570 రూపాయలు ఉంటే… ఇప్పుడు 590 రూపాయలు అయ్యింది. అంటే 20 రూపాయలు పెరిగింది. మరో బ్రాండ్‌ క్వార్టర్‌ 200 రూపాయల నుంచి 210 రూపాయలకు పెరిగింది. కొన్ని బ్రాండ్లలో క్వార్టర్‌ బాటిల్‌పై 10 నుంచి 40 రూపాయల వరకు, హాఫ్‌ బాటిల్‌పై 10 నుంచి 50 రూపాయల వరకు, ఫుల్‌ బాటిల్‌పై 10 నుంచి 90 రూపాయల వరకు ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.ఫారిన్‌ లిక్కర్‌పై చాలాకాలంగా ధరలు పెరగలేదు. పెరుగుతున్న రవాణా, ఇతర ఖర్చుల కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపారు.. ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ. సరఫరాదారులకు ఇచ్చే ధరను 20శాతం పెంచారు. విదేశీ మద్యం బ్రాండ్ల కొనుగోలు ధరలు పెంచటం వల్ల ఆయా బ్రాండ్ల ఎమ్మార్పీ పెరిగింది.ఇక… 150రూపాయలుగా ఉన్న 180 ఎంఎల్‌ లిక్కర్‌ సీసా ధర… ప్రస్తుతం అలాగే ఉంది. అయితే 750 ఎంఎల్‌ మద్యం బాటిల్‌ ధర కూడా అలాగే కొనసాగుతోంది. కొన్ని లిక్కర్‌ బ్రాండ్లపై మాత్రం ధరలు పెరిగింది. 180 ఎంఎల్‌ 200 నుంచి 210 రూపాయలు పెరిగింది. కొన్ని 750 ఎంఎల్‌ లిక్కర్‌ సీసా ధర 4వేల 330 నుంచి 5వేల 450కి పెరిగింది. అంటే.. 11వందల 20 రూపాయలు పెరిగింది. ఇలా… కొన్ని బ్రాండ్లపై ట్యాక్స్‌ ప్రభావం పడితే… మరికొన్ని బ్రాండ్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఏదిఏమైనా… ఇప్పటికే ఏపీలో చాలాసార్లు మద్యం ధరలు పెంచారు. ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో మద్యం వినియోగదారులు లబోదిబో అంటున్నారు. ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *