నంద్యాల:రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌ కు దారేది’ అనే కార్యక్రమంలో టిడిపి,జనసేన నంద్యాల టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్‌ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యచరణలో భాగంగా నంద్యాల నుండి కానాల వెళ్లే రహదారులు గుంతమయంగా మారడంతో మేము అభివృద్ధి చేసాము అంటూ ప్రగల్బాలు పలుకుతున్న వైసీపీ నాయకులు ఎక్కడ వేశారో చెప్పాలని టీడీపి జనసేన నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షుడు మనియార్‌ ఖాలీల్‌ మహ్మద్‌,మండల కన్వీనర్‌ గురునాధ్‌ రెడ్డి,ముడియం కొండా రెడ్డి, ఎమ్మెన్సీ ఫ్లోర్‌ లీడర్‌ మహబూబ్‌ వలి,కౌన్సిలర్‌ నాగార్జున,జనసేన నాయకులు యదవల్లి విశ్వనాధ్‌,పిడికల సుధాకర్‌,సందీప్‌,పిచ్చికే రాజు,ఆకుల మల్లేష్‌,చందు,సుధారం బ్రదర్స్‌ మరియు వార్డ్‌ ఇంఛార్జిలు,గ్రామ నాయకులు తెలుగుదేశం,జనసేన కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *