న్యూ ఢిల్లీ :నవంబర్ 16 కురించారు. నిన్న ముంబాయి వేదికగా జరిగిన సెమీఫైనల్ భార‌త్‌-కీవీస్‌ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలు చేయగా ఏడు వికెట్లను కూల్చి మహ్మద్ షమీ కివీస్ ను ఇంటిదారి ప‌ట్టించారు. టీమిండియా ప్రదర్శనకు ప్రధాని మోదీ కూడా ఫిదా అయిపోయారు.జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ, షమీలపై ప్రశంసలు కురిపించారు. వన్డేల్లో కోహ్లీ తన 50వ సెంచరీని సాధించడమే కాక… అత్యుత్తమ క్రీడాస్ఫూర్తికి, పట్టుదలకు ఉదాహరణగా నిలిచాడని మోదీ ప్రశంసించారు.ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం అతని అంకిత భావానికి నిదర్శనమని చెప్పారు. భవిష్యత్ తరాలకు కోహ్లీ ఒక బెంచ్ మార్క్ ను నెలకొల్పుతూనే ఉన్నాడని కొనియాడారు. ఈ మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ ప్రతిభను కనపరిచిన షమీకి అభినందనలను తెలుపుతున్నానని చెప్పారు. షమీ ఎంతో బాగా ఆడాడని.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *