బిజెపి యూవమోర్చా జాతీయ కార్యవర్గ సమావేశం
బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాలి.
ఏపీ బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ
న్యూఢిల్లీలో బిజెపి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరపున బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ ఆధ్వర్యంలో బిజెపి యువమోర్చా రాష్ట్ర ట్రెజరర్ బి కృష్ణచైతన్య, రాష్ట్ర బిజెపి యువమోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి యువమోర్చా రాష్ట్ర ట్రెజరర్ బి కృష్ణచైతన్య మాట్లాడుతూ: నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ దేశ ప్రజలకు పెద్దపేట వేస్తూ వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని అలాగే దేశ రక్షణకు పెద్దపేట వేస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. జాతికార్యవర్గ సమావేశంలో మండల సర్వశక్తీకరణ, అభియాన్ ప్రశిక్షణ వర్గ్ కార్యక్రమం ద్వారా దేశంలో బిజెపి పార్టీని ప్రతి మండలంలో యూత్ వింగ్ కమిటీల ద్వారా దేశవ్యాప్తంగా బిజెపి పార్టీని బలోపేతం చేయాలని నరేంద్ర మోడీ ఆశయాలు అనుగుణంగా మనమందరం కలిసికట్టుగా బిజెపి పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.