విశ్లేషణ)
ఎన్నికలు సవిూస్తున్న తరుణంలో కేంద్రం మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా బీజేపీ సర్కారు ఓ విస్తృత కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. దేశంలో చాలా మందికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వారిలో చాలా మంది అర్హత ఉన్నా.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అలాంటి వారికి పథకాలు అందించేందుకు ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతోంది. దీని కింద దేశంలోని 2.7 లక్షల పంచాయతీల్లో మెగా డ్రైవ్‌ చేపట్టనుంది.ఈ డ్రైవ్‌లో ఆయా పథకాల అర్హులను గుర్తించి, వారికి ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకోనున్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీఆరు నెలల లక్ష్యాన్ని నిర్దేశించారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇటీవల ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. వచ్చే 6 నెలల్లో దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు పూర్తిస్థాయిలో అందించాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ విషయాన్ని గత కేబినెట్‌ సమావేశంలోనూ ప్రధాని ప్రస్తావించారు. కేంద్ర పథకాలను ప్రజలకు చేరువ చేసేలా దేశంలోని 2.7 లక్షల పంచాయతీల్లో అర్హులను గుర్తించాలని ప్రధాని ఆదేశించారు. ప్రజలకు పథకాలు అందించేందుకు మరింత కష్టపడి పనిచేయాలని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందని లబ్ధిదారులకు వేగంగా చేరేలా చూడాలని మంత్రులకు సూచించినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. ఇందు కోసం ప్రత్యేకంగా ప్రచార, అవగాహన రథాలు రూపొందించనున్నారు. వీటి ద్వారా ఈ ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీపావళి తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడిరచాయి. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర కింద అర్హులైన ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (గ్రావిూణ), పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఫసల్‌ బీమా యోజన, పోషణ్‌ అభియాన్‌, ఉజ్వల్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాలు అందిస్తారు.అర్హత ఉండి పథకాలు అందుకోలేని వారికి అండగా నిలిచేలా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాళ్‌ ప్రభుత్వం ఇలాంటి డ్రైవ్‌లను నిర్వహించాయి. ఏపీలో ఇటీవల జనన్న సురక్ష పేరుతో అర్హులైన వారికి పథకాలు అందించేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి అర్హులను గుర్తించారు. వలంటీర్ల సాయంతో ప్రత్యేకంగా టోకన్లు జారీ చేయించారు. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అక్కడిక్కడే ప్రత్యేకంగా సర్టిఫికెట్లు మంజూరు చేశారు. అర్హులైన వారికి పథకాలు వర్తింపజేశారు. ఆధార్‌ అప్‌డేట్లు, ఫోన్‌ నెంబర్‌ లింక్‌, కుల, ఆదాయ సర్టిఫికెట్లను క్యాంపుల్లోనే మంజూరు చేసి పథకాలకు దరఖాస్తు చేయించారు. అర్హత ఉండి దరఖాస్తు వారికి రేషన్‌ కార్డులు తక్షణం మంజూరు చేశారు. పశ్చిమ బెంగాల్లో సైతం ఇలాంటి డ్రైవ్‌ జరిగింది. అర్హులకు పథకాలు అందించేందుకు మమత సర్కార్‌ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. రాబోయే ఆరు నెలల్లో తన పథకాలన్నీ పూర్తి స్థాయికి చేరుకోవాలని తాను కోరుకుంటున్నానని’’ ఒక మూలాధారం తెలిపింది.ఈ డ్రైవ్‌ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (గ్రావిూన్‌), జాతీయ గ్రావిూణ జీవనోపాధి మిషన్‌, పీఎం కిసాన్‌, ఫసల్‌ బీమా యోజన, పోషణ్‌ అభియాన్‌, ఉజ్వల యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, జనౌషధి యోజన మరియు పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన వంటి పథకాల సంతృప్తతను నిర్ధారిస్తుంది. నైపుణ్యాభివృద్ధి పథకాలు మరియు ఇటీవల ప్రారంభించిన విశ్వకర్మ యోజనతో పాటు, వారు చెప్పారు.సంక్షేమ పథకాల సంతృప్త ఆవశ్యకతను మోదీ పదే పదే నొక్కిచెప్పారు, అటువంటి విధానం ఎలాంటి వివక్షను కూడా తోసిపుచ్చుతుందని మరియు అర్హులైన ప్రతి పౌరునికి సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తుందని నొక్కి చెప్పారు.వచ్చే ఏడాది ఏప్రిల్‌`మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అధికార బీజేపీ సన్నద్ధమవుతున్న తరుణంలో, పార్టీని వరుసగా రెండు వైపులా నడిపించిన తర్వాత వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కోరుతున్న మోడీ నాయకత్వంలో ఈ సంతృప్త డ్రైవ్‌ వచ్చింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాలు.గ్వాలియర్‌లోని సింధియా స్కూల్‌ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ, పేదరికాన్ని అరికట్టేందుకు సంక్షేమ చర్యలపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని అన్నారు.కనీసం ఒక్క పేద కుటుంబమైనా చేయి చేయి వేయాలని ఆయన ప్రేక్షకులకు చెప్పారు.వంటగ్యాస్‌, గృహాలు, బ్యాంకు ఖాతాలు, ఆరోగ్య బీమా సహా ప్రతి పేద వ్యక్తి సంక్షేమ పథకాల పరిధిలోకి వచ్చే వరకు విశ్రమించకూడదని మోదీ అన్నారు.భారతదేశాన్ని పేదరికం నుండి విముక్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ మార్గాన్ని అనుసరించి, 13.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడారని, ఈ మార్గాన్ని అనుసరిస్తే, భారతదేశం కూడా పేదరికాన్ని తొలగించి అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *