రాజంపేట పార్లమెంట్ నూతన అద్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తో మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దొమ్మలపాటి రమేష్.

మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మదనపల్లి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి దొమ్మలపాటి రమేష్ , నూతనంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైన చమర్తి జగన్ మోహన్ రాజు   విచ్చేయగ ఆయనకు అభినందనలు తెలుపుతూ, పుష్పగుచ్చం అందచేసి మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కార్యవర్గ సమావేశం మరియు ఆత్మీయ సమావేశం నిర్వహించి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న విషయాలపై చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ యువ నాయకులు దొమ్మలపాటి యశశ్వి రాజ్ గారు, మండల అద్యక్షులు దేవరింటి శ్రీనివాసులు గారు, రామసముద్రం మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ గారు, నిమ్మనపల్లి మండల అద్యక్షులు పుర్రా వెంకటరమణ గారు మరియు మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *