విజయవాడ:రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి ఆందోళన వ్యక్తంచేశారు.ఈక్రమంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతు..చంద్రబాబు ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తమకు నమ్మకం కోల్పోయామని..చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు వయస్సుని, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎయిమ్స్‌ లేదా ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్‌ చేశారు.మరోవైపు చంద్రబాబు కుటుంబ సభ్యులు జైల్లో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తున్నారు.ఆయన ఉండే సెల్‌ అపరిశుభ్రంగా ఉందని అటువంటి చోట నిర్భంధించటం దారుణం అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని..డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *