తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 10: తాడేపల్లిగూడెంలో రూపాయకే బిర్యాని అనడంతో ప్రజలు ఎగబడ్డారు. ఆర్టిసి బస్టాండ్ సవిూపంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఫుడ్ ఫారెస్ట్ రెస్టారెంట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాత రూపాయి నోటుకి బిర్యానీ అని ప్రకటించింది. ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ ఆఫర్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటల మధ్య పెట్టారు. దీంతో హోటల్ వద్ద పాత రూపాయి నోటుతో జనం బారులు తీరారు. క్యూ లైన్ రోడ్డు పైకి రావడంతో ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగింది.