రుద్రవరం:ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(ఏపీపీ హెచ్‌ సి డి ఎ) వైద్యులు జీవో 85కి వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ,ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్యులందరూ నల్ల బ్యాడ్జిలు ధరించి విధులు నిర్వహించారు. మంగళవారం ఆలమూరు ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ అమర్నాథ్‌ రెడ్డి, డాక్టర్‌ గాయత్రి, రుద్రవరం ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ శ్రావణి, నరసాపురం డాక్టర్‌ బాబు, డాక్టర్‌ శివ మోహన్‌, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు జీవో 85 ద్వారా, తమ మూడేళ్ల సర్వీసు అర్ధం లేకుండా పోయింది. ఇలా అకస్మాత్తుగా జీవోను మార్చడం అన్యాయం అని, తమ వృత్తి ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. గత రెండు నెలలుగా జీవో 85 రద్దు చేయమని అందరి అధికారులకు, శాసనసభ్యులకు అర్జీలు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదని వైద్యులు నిరాశ వ్యక్తం చేశారు. కోవిడ్‌ 19 సమయంలో మా జీవితాలను ప్రమాదంలో పెట్టి సేవలు అందించినప్పటికీ, ఇప్పుడు జీవో85 ద్వారా పీజీ అవకాశాలు తగ్గించడం అన్యాయమని, ఇది ముఖ్యంగా గ్రావిూణ, గిరిజన ప్రాంతాల్లో సేవలను ప్రభావితం చేస్తుందని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *