ఎపి రవాణా ,యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని గౌరవ ప్రదంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోియేషన్ అధ్యక్షుడు నరసింహ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా ,యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని రాయచోటి పట్టణం మండిపల్లి భవన్ తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహ కుమార్ ఇతర అసోసియేషన్ ,రెవెన్యు ఉద్యోగులు గౌరవ ప్రదంగా కలిసి పుష్ప బుక్కే లు అందజేసి వారికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం రెవెన్యు శాఖలో ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళి పరిస్కరించేల కృషి చేయాలనీ వారికీ విజ్ఞప్తి చేశారు.వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి వర్యులు రెవెన్యు ఉద్యోగుల యొక్క న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిస్కరించేల కృషి చేస్తానని భరోసా కల్పించినట్లు అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోియేషన్ అధ్యక్షుడు నరసింహ కుమార్ గారు తెలిపారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *