న్యూఢల్లీి జూన్‌ 10 భారత ఎన్నిక సంఘం(ఈసిఐ) ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది. ఖాళీగా ఉన్న అసెంబ్లీ సీట్లు ఇలా ఉన్నాయి..బీహార్‌ (1), పశ్చిమబెంగాల్‌ (4), తమిళనాడు(1), మధ్యప్రదేశ్‌(1), ఉత్తరాఖండ్‌(2), పంజాబ్‌(1), హిమాచల్‌ ప్రదేశ్‌(3). జులై 10న వీటికి ఉపఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు జులై 13న జరుగనున్నది.
ఉపఎన్నికల షెడ్యూల్‌
నామినేషన్‌ ల దాఖలు చివరి తేదీ: జూన్‌ 21,నామినేషన్ల పరిశీలన: జూన్‌ 24,అభ్యర్థుల ఉపసంహరణ చివరి తేదీ: జూన్‌ 26,పోలింగ్‌ తేదీ: జులై 10,ఫలితాలు: జులై 13.ఉపఎన్నికలు అనేవి అధికారంలో ఉన్న అభ్యర్థి రాజీనామా చేసినా లేక చనిపోయినా ఏర్పడిన ఖాళీ స్థానానికి జరుగుతాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *