సీపీఐ( యం ఎల్‌) సీపీ పార్టీ జాతీయ కమిటీ
హైదరాబాద్‌ జూన్‌ 4 : మనువాద,బ్రాహ్మణీయ,దళారి ,దోపిడీ బూర్జువా పాలక వర్గాల ను ప్రజలు తిరస్కరించారని సీపీఐ( యం ఎల్‌) సీపీ పార్టీ జాతీయ కమిటీ పేర్కొంది.కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎవ్వరికీ సంపూర్ణ మెజార్టీ ఇవ్వని పక్షంలో ప్రాంతీయ పార్టీల పై ఆధార పడ వాల్సివచ్చింది, కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రజలను ,వారి సమస్యలను పట్టించుకోకుండా కేవలం,బడ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేసి,ప్రజల ప్రభుత్వ రంగా సముస్తలను గంప గుట్టగా కారు చవు కాగా అమ్మివేసిందని పేర్కొంది.ప్రజా సమస్యల నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకు రామమందిరం,సనాతన ధర్మం,ఒకే దేశం,ఒకే ప్రజా,ఒకే పాలనా పేరుతో ,దళిత,మైనారిటీ, ఆదివాసీల పై దాడులు బీజేపీ, దాని అనుబంధ సంస్థలు చెయ్యడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొంది.సుదీర్ఘ కాలంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ను కూడా ప్రజలు తరిమి కొట్టారు స్వతంత్రం పేరుతో ఈ న్ని రోజులు ప్రజలను భ్రమలో ఉంచి చివరకు ఈ దళారి,బూర్జువా,దోపిడీ,పాలక వర్గాలు కేవలం బడ పెట్టుబడి దర్లు,విదేశీ కార్పొరేట్‌ కంపిణీలకే ఉపయోగం పడుతున్నాయని ప్రజలు గమనిస్తున్నారుఆదివాసీల సంపద అయినా అదువులను,అడివి దోపిడీని అడ్డుకోవాలని,అన్ని రకాల కార్పొరేట్‌ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా విశాల విప్లవ ఉద్యమాలను నిర్మించాలని సీపీఐ( యం ఎల్‌) సీపీ రెడ్డి పార్టీ జాతీయ కమిటీ పిలుపు నిచ్చింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *