తెలంగాణాలో టిడిపి కి తిరుగి పూర్వ వైభవం
టిడిపి స్టేట్‌ వాణిజ సెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కేడి దినేష్‌
హైదరాబాద్‌ జూన్‌ 4: ఏపి ప్రజల తీర్పు టిడిపి పై గల విశ్వాసం..అభివృద్ధి.. దూర దృష్టి నిదర్శనమని తెలంగాణాలో టిడిపి కి తిరుగి పూర్వ వైభవం రావడం ఖాయమని టిడిపి స్టేట్‌ వాణిజ సెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కేడి దినేష్‌ అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ లో తెలుడుదేశం పార్టీ ఘనవిజయం పట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో టపాకాయలు పేల్చి సంబరాలు జ్జరుపుకున్నారు.ఈ సందర్బంగా కేడి దినేష్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి భారీ మెజార్టీ తీర్పు ఇచ్చిన ప్రజలకి 4 సారి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు విూద నమ్మకంతో, విశ్వాసంతో, అభివృద్ధితో, ఆంధ్ర నవ నిర్మాణం గురించి ఇచ్చిన తీర్పు అని అన్నారు.గురించి శుభాకాంక్షలు అదేవిధంగా తెలంగాణలో కూడా త్వరలో మార్పు వస్తుంది తెలంగాణలో కూడా పూర్వ వైభవం వస్తుందని అన్నారు.ఈ సందర్బంగా కేడి దినేష్‌ ఆధ్వర్యంలో టిడిపికి పోలీస్‌ బ్యూరో అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ , తెలంగాణ స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీ బక్కని నర్సింలు సమక్షంలో బిఅర్‌ఎస్‌ నాయకులు జాంభాఫ్‌ు డివిజన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ కుమార్‌ ముదిరాజ్‌, మరియు రాజేష్‌ గుకికర్‌, నరేష్‌ జైన్‌ సొంతగూటికి టిడిపి పార్టీలో చేరారు.ఈ కార్యక్రమం లో పి నందకిషోర్‌, జైరాజ్‌ యాదవ్‌, సోమశేఖర్‌ కురుమ, నీరజ్‌ వీర్‌, డి గోపాల్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *