లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

పేదలకు కొండంత అండ ముఖ్యమంత్రి సహాయనిది ఉందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను స్థానిక నాయకులుతో కలసి లబ్ధిదారులకు శ్రీకాంత్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.లబ్ధిదారుల వివరాలు…
సంబేపల్లె మండలంలోని గుణ్ణికుంట్ల గ్రామంలోని దిగువ రాచపల్లె కు చెందిన కొండూరు వెంకట రమణ రాజు కు రూ 68 వేలు, రౌతుకుంట గ్రామం కుంటక్రిందపల్లె కు చెందిన నల్లబోతుల ముసలయ్య కు రూ 78 వేలు , శెట్టిపల్లె గ్రామం బుర్రావాండ్లపల్లె కు చెందిన గోపగాని వెంకటేశ్వరి కి రూ 16 వేలు, రాయచోటి పట్టణంలోని వాల్మీకి స్ట్రీట్ కు చెందిన మెహరాజుద్దీన్ కు రూ 1.30 లక్షలు,యండపల్లె గ్రామం ముసల్ రెడ్డి గారిపల్లె కు చెందిన ఎర్రపురెడ్డి వెంకట సుబ్బమ్మ కు రూ1.80 లక్షలు విలువ చేసే చెక్కులను ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అందచేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం జగన్, ఎంఎల్ఏ శ్రీకాంత్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *