జగన్నాథ గట్టు పై ఏర్పాటు చేయనున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి సంబంధించిన పైలాన్‌ ను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జగన్నాథ గట్టు పై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్లతో నిర్మించనున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం పైలాన్‌ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌, మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి, లోకాయుక్త చీఫ్‌ జస్టిస్‌ పి. లక్ష్మణ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి జి.సత్య ప్రభాకర్‌, జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి,కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌, కర్నూలు నగర మేయర్‌ బివై.రామయ్య, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌, జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య, కెడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ విజయ మనోహర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సుభాష్‌ చంద్రబోస్‌, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్‌ డా జి.సృజన మాట్లాడుతూ రాయలసీమ ఆకాంక్షకు ప్రతీకైన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి క కర్నూలు జిల్లా ప్రజలందరి తరపున స్వాగతం తెలియజేసుకుంటున్నానన్నారు. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి, లోకాయుక్త చీఫ్‌ జస్టిస్‌ పి. లక్ష్మణ రెడ్డి గార్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. సుమారు 150 ఎకరాల్లో స్థాపితం అవ్వబోతున్న న్యాయ విశ్వవిద్యాలయం రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో ఒక మచ్చు తునకగా ఉండబోతుందని తెలియజేయటానికి సంతోషిస్తున్నానని కలెక్టర్‌ తెలిపారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారి సూచనలతో న్యాయ విశ్వవిద్యాలయం పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని కలెక్టర్‌ పేర్కొన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *