హైదరాబాద్:మాజీ ఎంపీ బిజెపి నేత జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కలిసారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తాను ఒకే జిల్లా వాసులం. తనకు టికెట్ రాలేదని తెలుసుకొని బాధతో తనను కలిసేందుకు వచ్చారని చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడలేదు. ప్రస్తుతం తాను బిజెపి లోనే కొనసాగుతున్నాను. చేవెళ్ల నుంచి మహేందర్ రెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం బిజెపి పార్టీతోనే ఉన్నాను.. భవిష్యత్తులో తనకు తమ అధిష్టానం ఏ బాధ్యతలు ఇచ్చిన స్వీకరిస్తానని అన్నారు.