కర్నులే, మార్చి 14:టీడీపీ అధినేత చంద్రబాబు 2014లో మోసపూరిత హావిూలిచ్చి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు పవన్‌, బీజేపీతో కూటమితో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఈబీసీ నిధుల విడుదల సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో రూ.629.37 కోట్లు బటన్‌ నొక్కి జమ చేశారు. ‘విూ బిడ్డ విూకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు.’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ నేతలు రాబోయే రోజుల్లో మరిన్ని మోసపూరిత హావిూలతో మభ్య పెడతారని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘వారు ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తామంటారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు. మోసాలు చెప్పే వారికి ఓటు అనే దివ్యాస్త్రంతో బుద్ధి చెప్పండి.’ అని జగన్‌ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *