అవనిగడ్డ :మోపిదేవిలో దారుణం జరిగింది. 14 సంవత్సరాల వయసు ఉన్న మనవరాలిని తాత అంకమ్మ (50) గర్భవతిని చేసాడు. మైనర్‌ బాలిక రాత్రి తీవ్ర కడుపు నొప్పితో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు వైద్య పరీక్షలు చేసి నాలుగు నెలల గర్భిణీగా నిర్ధారించారు. బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేసారు. నిందితుడు అంకమ్మ పరారీలో వున్నాడు. బాధిత బాలిక మోపిదేవిలో 9 వ తరగతి చదువుతోంది. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వాపోతోంది. అవనిగడ్డ డి.ఎస్‌.పి మురళీధర్‌ జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *