అక్టోబర్ 2 సోమవారం నాడు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరగబోయేటటువంటి నూర్ బాషా దూదేకుల కార్యవర్గ సమావేశానికి కేవలం జిల్లా అధ్యక్షులు మాత్రమే హాజరుకావాలని షేక్ నాగూర్ మీరా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సమావేశం ఉదయం 10 గంటల నుండి మొదలై సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంద న్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా నిర్వహించే కమ్యూనిటీ మీటింగులు ఏ విధంగా జరపాలి, ఏ విధంగా టీముని బలపరచడం ద్వారా సంఘానికి కలిగే మేలు తదితర విషయాల పై చర్చ కొనసాగుతుందని షేక్ నాగూర్ మీరా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు హోదాలో ఉన్నటువంటి అందరూ హాజరు కావాలని ఏ ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినా అటువంటి వారి మీద తగు చర్యలు ఉంటాయ న్నారు.