న్యూఢల్లీి, డిసెంబర్‌ 27: వచ్చే ఏడాది జనవరి 14 నుంచి రాహుల్‌ గాంధీ రెండో దశ జోడో యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సారి ఈ యాత్రకు ‘‘భారత్‌ న్యాయ్‌ యాత్ర’’ అనే పేరు పెట్టారు. మణిపూర్‌ నుంచి ముంబయి వరకూ రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 14 రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. మార్చి 20న యాత్ర ముగియనుంది. 6,200 కిలోవిూటర్ల మేర యాత్ర కొనసాగనుంది. భారత్‌ జోడో యాత్రలో ఎదురైన అనుభవాలతో రెండోసారి రాహుల్‌ గాంధీ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ సారి యువత, మహిళలతో పాటు అన్ని వర్గాలతోనూ ఆయన మాట్లాడతారు. మొత్తం 6,200 కిలోవిూటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్‌, నాగాలాండ్‌, అసోం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, రaార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ విూదుగా యాత్ర సాగుతుంది. చివరకు మహారాష్ట్రలో ముగుస్తుంది. ఈ సారి కాలినడకనే కాకుండా బస్‌లో యాత్ర కొనసాగుతుంది.’’
గతేడాది సెప్టెంబర్‌ 7వ తేదీన ఫస్ట్‌ ఫేజ్‌ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి మొదలైంది. దాదాపు 12 రాష్ట్రాల విూదుగా 4 వేల కిలోవిూటర్ల మేర సాగిన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగిసింది. దాదాపు 136 రోజుల పాటు రాహుల్‌ గాంధీ ఈ యాత్ర చేశారు. అయితే…ఫస్ట్‌ ఫేజ్‌లో పూర్తిగా పాదయాత్ర చేశారు రాహుల్‌ గాంధీ. ఈ సారి మాత్రం హైబ్రిడ్‌ మోడ్‌లో సాగనుంది. అంటే…కొంత దూరం వరకూ నడక ద్వారా ఆ తరవాత వాహనాల్లో యాత్ర చేయనున్నారు.ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ డీలా పడిరది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాలతో కాంగ్రెస్‌ మరోసారి ఆత్మపరిశీలనలో పడిరది. లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాహుల్‌ గాంధీ రెండోసారి జోడో యాత్ర నిర్వహించనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *