విజయవాడ, డిసెంబర్‌ 9: కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో… ఉచిత కరెంట్‌ నినాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడటంతో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉచిత కరెంట్‌ను ఇచ్చే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్‌గా ఆలోచిస్తోంది. త్వరలో జనసేనతో కలిసి విడుదల చేయబోయే తన మ్యానిఫెస్టోలో ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించనున్నట్లు సమాచారం. రెండు వందల యూనిట్ల లోపు కరెంట్‌ వాడే ఇళ్లు ఒక్క రూపాయి కూడా ఛార్జ్‌ చెల్లించక్కర్లేదు. ఇదే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కీలకమైన హావిూ కానుంది. అదే సీన్‌ కర్నాటకలో ఉచిత విద్యుత్‌ హావిూని ఇవ్వడమే కాకుండా దానిని అమలు కూడా చేస్తున్నారు. అదే ధైర్యంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ ఈ హావిూని ఇచ్చింది. వీటితో పాటు ఇచ్చిన ఆరు హావిూల దిశగా చర్యలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ నూతన ఆర్థిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విూడియాకు వెల్లడిరచారు. తెలంగాణ లో కాంగ్రెస్‌ గెలుపుతో, ఏపీలో కూడా ఉచిత విద్యుత్‌ బ్రహ్మాస్త్రాన్ని తెలుగుదేశం సంధించనుంది. కాంగ్రెస్‌ కూడా తెలంగాణ లో ఇచ్చిన హావిూలతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హాదా, సత్వరమే పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి వంటివి కూడా ప్రస్తావించనుంది. ఫ్రీ కరెంట్‌తో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తెలుపు రేషన్‌ కార్డు ఉన్న మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతీ నెలా నగదు జమ లాంటి హావిూలు కూడా తెలుగుదేశం మ్యానిఫెస్టోలో చోటు చేసుకుంటాయి. వీటిని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశానికి అత్యంత అవసరం. తన పార్టీని కాపాడుకోడానికి ఇదే దాదాపు చివరి అవకాశం. ఇప్పుడు కనుక ఓడిపోతే, సైకిల్‌ను అమాంతం కబళించడానికి భాజపా సిద్ధంగా ఉంది. అందుకే తెలుగుదేశం మ్యానిఫెస్టోలో చాలా హావిూలు ఉంటాయి. ఈ హావిూలకు అధికార వైకాపా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆంధ్రలో రాబోయేది హావిూల కాలం. త్వరలోనే ఇంటికి మూడుపూటలా భోజనం సరఫరా, అన్నం కలిపి నోట్లో ముద్దలు పెడతాం లాంటి హావిూలు (క)వినిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *