అంబేద్కర్‌ కోనసీమ జిల్లా నవంబర్‌ 27: : సైకో జగన్‌కు ఎక్స్‌ పైరీ డేట్‌ ఫిక్స్‌ అయ్యిందని.. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్‌ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రకు 79 రోజులు బ్రేక్‌ ఇచ్చినందుకు క్షమించాలన్నారు. పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నానని.. టీడీపీ ` జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి వంద కిలోవిూటర్ల పాదయాత్రకు గుర్తుగా ప్రత్యేక హావిూలు ఇచ్చానన్నారు. వైసీపీ నాయకుల అవినీతిని భయటపెట్టానని.. ఒక్క ఛాన్స్‌ పేరుతో జగన్‌ చేస్తున్న దోపిడీ భయటపెట్టానని చెప్పారు. పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే సైకో జగన్‌ అడ్డుకోవడానికి స్కెచ్‌లు వేశారన్నారు. అన్న ఎన్టీఆర్‌ ఇచ్చిన గొంతు ఆపే మగాడు పుట్టలేదని… ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర అని యువనేత హెచ్చరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *