ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద స్పందన అర్జీదారులకు కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం.ఈ రోజు అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ గారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమానికి వచ్చే అర్జిదారులకు ప్రతి సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా నలుమూలల నుంచి వస్తున్న వారికి రుచికరమైన భోజనం ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి,దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అర్జీదారులు..ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు శుగవాసి శ్యాం కుమార్,జావేద్,అమీర్ ఖాన్ ,బేపారి జబిబుల్లా ఖాన్,తదితరులు హాజరయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *