హైదరాబాద్‌: ప్రజా శాంతి పార్టీ అధినేత కె. ఎ. పాల్‌ ఆధ్వర్యంలో 12 మంది అభ్యర్థులకు సోమవారం నాడు బీ ఫారం ఇచ్చారు. పాల్‌ మాట్లాడుతూ కెసిఆర్‌, కేటీర్‌ నావిూద దాడుల చేసారు. అనిల్‌ తో కొట్టించారు. నా పార్టీ లో చేరినవారికి నరకం చూపించారు. గద్దర్‌ అన్న ను కూడా చిత్రహింశాలు చేసారు. రేవంత్‌ రెడ్డి కూడా గద్దర్‌ అన్న విూద వత్తిడి తెచ్చారు పార్టీ లో రావాలని. కామారెడ్డి లో నేను పోటీ చేస్తా అని అనౌన్స్‌ చేయండంతో రైతులను చిత్రహింసలు చేసారు. కెసిఆర్‌, కాంగ్రెస్‌, విూద తెగించిన వారు మా పార్టీ లో చేరుతున్నారు. ఒక్క ఒక్క నియోజకవర్గం లో 100 నుండి 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు కెసిఆర్‌. రేవంత్‌ రెడ్డి కి షర్మిల రెడ్డి మాద్దతు ఇస్తారు అని నేను ముందె చెప్పా. అమెరికా నుండి వందల కొద్దిగా కాల్‌ వస్తున్నాయ కాంగ్రెస్‌ పార్టీ కి రేవంత్‌ రెడ్డి కి మద్దతు ఇవ్వండి అని. లక్షల కోట్లు ఇస్తామని అంటున్నారు కొన్ని రాజకీయ పార్టిలని అన్నారు.
సెంట్రల్‌ లో ఉన్నముగ్గురు పెద్దమనుషులు వస్తున్నారు నా తో మాట్లాడి ఒప్పించాలని.. నా అకౌంట్లు ఓపెన్‌ చేస్తే 50లక్షల కోట్లు డొనేట్‌ చేస్తా. ప్రపంచం లోనే చందా తీసుకొని ఏకైక వ్యక్తిని నేను. 5 లక్షల కోట్లు పంచాను ప్రజల అభివృద్ధి కోసం. 40 లక్షల వితంతులకు ఆదుకున్నా ఘనత నాది. కులగజ్జి ఉండవద్దు అని, దళిత అమ్మాయిని పెండ్లి చేసుకున్నా. షర్మిల కు ఓటు బ్యాంక్‌ ఉందా, కోదండ రామ్‌ పార్టీకి ఓటర్స్‌ ఉన్నారా అని ప్రశ్నించారు. భారత్‌ శ్రీలంక కావద్దు అనే ఉదేశ్యం తో నేను రాజకీయాల్లోకి వచ్చ. కమ్మ రాజ్యంలో కడప రెడ్డి మూవీని ఆపింది నేను. ఒకప్పుడు నన్ను దేవుడు అన్నారు ఇప్పుడు దయ్యం అంటున్నారు. రేవంత్‌ రెడ్డి కి మద్దతు ఇవ్వను. నన్ను గెల్పిస్తాయి ఉచిత విద్య, లక్షల కోట్లు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తా. మోడీ గవర్నమెంట్‌ ని అదుకున్నది నేను కాదా. కోదండరాం లాంటి వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీ కి సపోర్ట్‌ చేస్తే దేశం ఏం కావాలి. రాహుల్‌ గాంధీ నా తో రెగ్యులర్‌ గా మాట్లాడుతున్నారు. నాకు 30 సీట్లు వచ్చిన అధికారం నాదే, తెలంగాణ లో నేనే సీఎం అవుతా. నా అధికారంలో రాష్ట్రం ని అభివృద్ధి లో నడుపిస్తా. విశాఖపట్నం యం.పి గా పోటీ చేస్తానని కే. ఎ. పాల్‌ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *