సోమవారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం కలక్టరేట్ కార్యలయం దగ్గర జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎన్నాళ్ళు….ఎన్నేళ్ళు.. ఈ కన్నీళ్లు….? అన్నమయ్య డ్యాం బాధితులను ఆదుకోండి CM గారు అంటూ నిరసన కార్యక్రమంలో మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు హాజరై సభను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయి ప్రాణ, ఆస్తి నష్టం జరిగి రెండేళ్లు కావస్తున్న ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం దుర్మార్గం, నష్టం జరిగిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న నాయకులకు సంఘీభావం తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయుడు ,కోడూరు నరసింహా ప్రసాద్ , జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర , అతికారి దినేష్ , మణి , జనసేన వీర మహిళ రెడ్డి రాణి ,శ్రీరామ శ్రీనివాసులు,టీడీపీ నాయకులు,సుగవాసి శ్రీనివాసులు,మన్నేరు రామాంజనేయులు,బడిశెట్టి రవి,బండకింద మనోహర్,సహదేవా,జనార్ధన్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు