హైదరాబాద్‌: ఓట్ల కోసం కేటీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల విమర్శించారు. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలుచేస్తున్నప్పుడు, టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి,ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్టే కదా? ఉద్యోగాలు ఇవ్వండని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పలకలేదు గాని. ఇప్పుడు జాబ్‌ క్యాలెండర్‌ఇస్తామని బొంకుతున్నాడు. బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించింది విూరే. పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది విూరే. ఇప్పుడు తప్పు జరిగిందని సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళన అంటున్నదివిూరే. ఇన్ని డ్రామాలన్ని ఎందుకు దొర? ఓట్ల కోసమే కదా అని నిలదీసారు. ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు నిజం. విూరు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారన్నదే వాస్తవం. ఏళ్ల తరబడినిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారు.ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ బిడ్డలకు క్షమాపణలు చెప్పండి. నిరుద్యోగుల బలిదానాల విూద అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులనే నిండా ముంచిన దుర్మార్గులు విూరు. ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి అంటూ విూరు చేసిన మోసాలు చాలు. ఈ నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలల్లోనే విూ ప్రభుత్వం మంట కలిసిపోతుంది. తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతారు విూరని ఆమెమండిపడ్డారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *