గొప్ప పరిపాలనాధక్షుడు శ్రీకృష్ణ దేవరాయులు

టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు

రాజంపేట :విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీ కృష్ణదేవరాయులు వర్ధంతిని సంధర్భంగా మంగళవారం టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు గారు రాజంపేట టిడిపి ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు గారితో కలిసి రాజంపేట పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సంధర్భంగా చమర్తి జగన్ మోహన్ రాజు గారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయులు గొప్ప పరిపాలనాధక్షుడిగా ప్రపంచ చరిత్రలో ఖ్యాతి గడించాడన్నారు. అలాంటి రాజనీతిజ్ఞుడు, సాహితీ సమారంగణ సార్వభౌముడు అంటూ ఆయన్ని విస్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *