అన్నమయ్య జిల్లా,రాయచోటి: జనాబా పాతిపదికన తమ కులాని చెందాల్సిన నామినేటేడ్‌ పదవులు,ఎమ్మెల్యే టిక్కెట్‌లు ‘‘మాకు రావాల్సిన నామినేటేడ్‌ పదవులు,ఎమ్మెల్యే టికెట్లు మాకే కేటాయించాలని అన్నమయ్య జల్లా నూర్బాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు పాలగిరి మౌలా పార్లమెంట్‌ మెంబర్‌ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని,అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌ కాంగ్ర్‌పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిని కోరినట్లు తెలపారు. సోమవారం అన్నమయ్య జల్లా జిల్లాకేంద్రంలో కలెక్టర్‌ బంగా నిర్మాణం సందర్భంగా భూమి పూజచేయడానికి ఎం.పి రాయచోటికి విచ్చేశారు.ఈ సందర్భంగా పాలగిరి మౌలా మిథున్‌రెడ్డి,శ్రీకాంత్‌రెడ్డి తోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.అనంతరం మౌలా దూదేకుల కులస్తుల సమస్యలను ఎం.పి దృష్టికి తీసుకెళ్లానన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే దూదేకుల కులస్తులు 25లక్షలకు పైగా వున్నారన్నారు.తమ జనాబాను దృషిలో ఉంచుకుని తమకు చెందల్సి పదవులు తమకు కేటాయించేటట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాని ఎం.పి ని కోరినట్లు తెలిపారు.అందుకు ఆయన కూలంగా స్పందించారన్నారు.సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.  త్వరలో రాయచోటిలో నిర్వహించనున్న నూర్బాషా దూదేకుల సంఘం సమావేశానికి ఎం.పి.మిథున్‌రెడ్డిని ఈ సందర్భంగా ఆహ్వానించినట్లు చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *