హైదరాబాద్‌, అక్టోబరు 14: హైదరాబాద్‌లో గ్రూప్‌ 2కి ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థి మృతి అర్థరాత్రి కలకలం రేగింది. పరీక్ష వాయిదా పడటం వల్లే ఆమె మృతి చెందిందని గ్రూప్‌ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు మృతదేహాన్ని కదలనివ్వబోమని భీష్మించారు. అయితే పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో వరంగల్‌ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఓ హాస్టల్‌లో ఉంటూ కాంపిటేషన్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా పడటంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందనితోటి అభ్యర్థులు, అక్కడే పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. స్థానికులు, హాస్టల్‌ సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు.
భారీగా చేరుకున్న అభ్యర్థులు పోలీసులు ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అభ్యర్థులు అడ్డుకోవడంతో అర్థరాత్రి వరకు హాస్టల్‌లోనే మృతదేహం ఉండిపోయింది. విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ సీనియర్‌ లీడర్‌ లక్ష్మణ్‌, బండారు విజయలక్ష్మి నిరసనల్లో పాల్గొన్నారు. రాత్రి రెండు గంటల వరకు ఈ హైడ్రామా కొనసాగింది. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రూప్స్‌ అభ్యర్థులు నినాదాలు చేశారు. ఆమెకు న్యాయం చేసే వరకు అక్కడే ఉంటామని భీష్మించారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఆందోళనకారులతో పోలీసులు మాట్లాడుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు.పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. నిరసనకారులను చెదరగొట్టారు. ప్రతిగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఇలా టెన్షన్‌ వాతావరణంలోనే ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రవళిక పేరు విూద ఓ సూసైడ్‌ నోట్‌ సోషల్‌ విూడియాలో తిరుగుతోంది. అమ్మా నన్ను క్షమించండీ అంటూ మొదలు పెట్టిన లేఖలో చాలా అంశాలు ప్రస్తావించింది. తాను నష్టజాతకురాలిని అని తన వల్ల పేరెంట్స్‌కు ?ప్పుడూ బాధలే అని చెప్పుకొచ్చింది. విూకు నేను చాలా అన్యాయం చేశానని ఎవరూ ఏడవొద్దని చెప్పిన ప్రవళిక..తన కాలు కిందపెట్టకుండా చూసుకున్న అమ్మకు ధన్యవాదాలు చెప్పింది. అమ్మ కోసం ఏం చేయలేకపోతున్నాననని క్షమించాలని కోరుతూ లేఖ ముగించింది. ఉదయాన్నే ప్రవళిక బంధువులు హైదరాబాద్‌ వచ్చారు.
గాంధీ ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని చూసిన తల్లి కుప్పకూలిపోయారు. మెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని తలెత్తుకొని వస్తుందని అనుకుంటే ఇలా విగత జీవిగా పడి ఉండటం చూసి బంధువులు కూడా తట్టుకోలేకపోయారు.
రాజకీయ మలుపులు
హైదరాబాద్‌లో గ్రూప్‌ 2 కోసం ప్రిపేర్‌ అవుతున్న ప్రవళిక ఆత్మహత్య రాజకీయ మలుపు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ యువతి మరణంపై రాజకీయ పార్టీలు ఘాటుగా స్పందిస్తున్నాయి. అటు నిరుద్యోగుల్లోనూ ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రైవేటు హస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న ప్రవళిక శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ప్రవళికది వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి. డిగ్రీ పూర్తి చేసిన ప్రవళిక రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని ఉంటూ కోచింగ్‌ తీసుకుంటోంది. గ్రూప్‌2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపానికి గురైన ప్రవళిక హాస్టల్‌ రూంలో సూసైడ్‌ చేసుకున్నట్టు స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. ఆమె పేరు విూద సూసైడ్‌ నోట్‌ కూడా సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతోంది. రాత్రి హైడ్రామా మధ్య ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాత్రికి రాత్రే పోస్టుమార్టం పూర్తి చేశారు. వెంటనే స్వగ్రామానికి ప్రవళిక డెడ్‌బాడీని తీసుకొచ్చారు. పోలీస్‌ బందోబస్తు మధ్య స్వగ్రామం బిక్కాజిపల్లికి మృతదేహం చేరుకుంది. ప్రవళిక మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇది ప్రభుత్వ హత్యగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రవళిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ లీడర్లు రాత్రి అశోక్‌నగర్‌ చేరుకున్నారు. బీజేపీ సీనియర్‌ నేత లక్ష్మణ్‌సహా ఇతరులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రవళిక మృత దేహం తరలింపును అడ్డుకుంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు మెరుపు ధర్నాకు దిగారు. ఒక్కసారిగా ఆందోళనకారులు రోడ్డుపైకి రావడంతో చిక్కడిపల్లి పరిసరాల్లో పూర్తిగా ట్రాఫిక్‌ జామ్‌ అయిపోయింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో రాజకీయనాయకులను బలవంతంగా పోలీసులు వారి ఇళ్లకు తరలించారు. ధర్నా చేస్తున్న అభ్యర్థులపై లాఠీఛార్జ్‌ చేశారు. మాట వినని వారిని ఈడ్చి పడేశారు. బలవంతంగా అభ్యర్థులను అక్కడి నుంచి తరలించి ప్రవళిక మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్‌ విూడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్థరాత్రి జరిగిన హైడ్రామా విజువల్స్‌ వైరల్‌గా మారాయి.
తమ స్వార్థ రాజకీయాల కోసం యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్‌ రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అంటూ బీఆర్‌ఎస్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో విమర్శలు చేసింది. మొన్నటి వరకు గ్రూప్‌ 2ను వాయిదా వేయాలని డిమాండ్‌ చేసిన వీళ్లే ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. తస్మాత్‌ జాగ్రత్త ఇలాంటి నీచ రాజకీయ నాయకుల కుట్రలకు, కుతంత్రాలకు బలి కావొద్దని తెలంగాణ యువతకు సూచనలు చేసిందా పార్టీ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *