జగిత్యాల: జగిత్యాల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ స్థానిక తహసిల్ చౌరస్తాలో దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జనాభా ఉన్న మున్నూరు కాపు నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజకీయ పార్టీలను రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిరచి మున్నురుకపుల సత్తా ఏంటో చూపిస్తాం అని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో జిల్లా మున్నూరు కాపు నాయకులు సమిండ్ల శ్రీనివాస్, ముసిపట్ల లక్ష్మీనారాయణ, రవి, సమిండ్లా రాజేష్, కొలగని సత్యనారాయన, కూతురు శేఖర్, ఉప్పు కిషన్, నీలి లింగయ్య, నరేష్, గదే కార్తిక్, తోట ప్రభు, కొమ్మెర మధుకర్, రాజు, చిట్ల సాయి తదితరులు పాల్గొన్నారు.