బద్వేలు: బద్వేలు రూరల్‌ పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని గోపవరం మండలం 67 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసి అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ప్రమాదం మంగళవారం రాత్రి జరిగింది ఇదే ప్రమాదంలో మరొకరు గాయపడ్డారు మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్‌ జిల్లా అక్కల గౌడ్‌ తాలూకా ఎట్టి జోవూరు గ్రామానికి చెందిన సందీప్‌ శరణప్ప 24 భయపడి రోడ్డు దాడుతుండగా బద్వేల్‌ నుంచి టమోటా లోడుతో అతివేగంగా వస్తున్న ఐచర్‌ వాహనం శరణప్ప ను బలంగా డి కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు ఇతను గోపవరం మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న సెంచురీ ప్లైవుడ్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు కాగా గోపవరం మండలం గోపవరం ప్రాసిటీ కాలనీ`2 కు చెందిన రమణయ్య తాగిన మత్తులో పి పి కుంట నుంచి ద్విచక్ర వాహనంలో వస్తుండగా పరిశ్రమ సవిూపంలో నడిచి వస్తున్న ఇద్దరినీ ఢీకొట్టాడు వీరు కూడా గాయపడ్డారు ఈ ప్రమాదంపై బద్వేల్‌ రూరల్‌ ఎస్సై చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *