రాయచోటి పట్టణంలోని చిత్తూరు రహదారి మార్గంలోని నీల్ పరి బజాజ్ షో రూమ్ లో శుక్రవారం జరిగిన పల్సర్ ఎన్ 150 బైక్ గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,నీల్ పరి బజాజ్ షో రూమ్ యజమాని సయ్యద్ అబ్దుల్ కలాం తో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూభారతదేశంలో మంచి అమ్మకాలు పొందుతున్న ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ‘బజాజ్ ఆటో’ ఒకటని,ఈ కంపెనీ తన వినియోగదారుల కోసం మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేస్తూనే ఉందన్నారు.
ఇందులో భాగంగానే ఇటీవల ‘పల్సర్ ఎన్ 150 బైక్ ను విడుదల చేసిందన్నారు.. ఈ కొత్త బైక్ తప్పకుండా మరింతమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, ఫయాజ్ అహమ్మద్,గౌస్ ఖాన్, జానం రవీంద్ర యాదవ్ , సున్నా తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *