అన్నమయ్య జిల్లా:మదనపల్లెలో నిమ్మనపల్లె మండల యువకుడు హత్యకు గురైన సంఘటన ఆదివారం కలకలం రేపుతుంది. నిమ్మనపల్లె మండలంలోని రాచవేటి వారి పల్లె పంచాయతీ, ఆచార్లపల్లెకు చెందిన దంపతులు వెంకటేష్ సుజాతల కుమారుడు కప్పల జయపాల్(27) వద్ద రెండు రోజుల క్రితం తన తల్లి10వేలు చేతికిచ్చి మదనపల్లెలోని కమ్మి వ్యాపారికి అప్పు చెల్లించి రావాలని కోరింది. జయపాల్ మదనపల్లెకు వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో కొందరు యువకులతో కలిసి బసినికొండ లోని ముంబై టు చెన్నై జాతీయ రహదారి పక్కన నిమ్మనపల్లె రోడ్డు సర్కిల్లోని ఓ వ్యవసాయ బావిలో అనుమానాస్పదంగా మృతి చెంది. శివమై కనిపించాడు. సమాచారం అందుకున్న మృతుని కుటుంబీకులు ఘటన స్థలం వద్దకు చేరుకొని మదనపల్లి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. జయపాల్ ను ఎవరో కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా లేక చంపి తీసుకొచ్చి బాయిలో పడేసారు అన్నది పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా తేలాల్సి ఉంది. తన బిడ్డను కొందరు యువకులు కొట్టి చంపేశారని మృతుని తల్లిదండ్రులు ఆరోపించడం విశేషం