పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , కింజారపు అచ్చం నాయుడు
2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తన ఎన్నికల హామీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నది.ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జులై నెలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు,వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజారపు అచ్చం నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైన టెక్కలి లోని,తరిపేట గ్రామంలో పెంచిన పెన్షన్ నగదును లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.