అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం:-ఎస్.కె పాలకొండ్రాయుడు బ్రదర్స్& సన్స్ తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం రోజు ఉదయం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని మాసాపేటలో ఎస్. కె పాలకొండ్రాయుడు బ్రదర్స్ & సన్స్ ఏర్పాటుచేసిన తేనీటి విందులో వారి పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి వారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన తన గెలుపుకు సహకరించిన కార్యకర్తలు అభిమానులకు నాయకులకు ధన్యవాదాలు తెలపారు. అనంతరం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభిమానులు కార్యకర్తలు ఏర్పాటుచేసిన కేకును కట్ చేశారు.కార్యకర్తలు అభిమానులు మంత్రి గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *