గాజా ఏప్రిల్ 13: ఇజ్రాయిల్ పై ఏ క్షణమైనా ఇరాన్ అటాక్ చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీన డమస్కస్లో జరిగిన ఓ దాడి కేసులో ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్పై అటాక్ చేయాలన్న దీక్షతో ఉన్నది. శుక్రవారం ఎటువంటి దాడి జరగపోయినా. ఇజ్రాయిల్ రక్షణ దళాలు మాత్రం హై అలర్ట్లో ఉన్నాయి. కొన్ని చోట్ల యాంటీ మిస్సైల్ మొబైల్ లాంచర్లను అప్రమత్తం చేశారు. ఇరాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ దళాలు కంటి విూద కునుకు లేకుండా జాగ్రత్తగా ఉన్నాయి. లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా కేంద్రాన్ని శుక్రవారం టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ప్రకటించింది.ఇజ్రాయిల్పై ఇరాన్ దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. లుఫ్తాన్సా విమాన సంస్థ తమ విమానాలను నిలిపివేసింది. ఇరాన్ వైమానిక మార్గాన్ని వాడడం లేదని చెప్పింది. టెహ్రాన్ నుంచి వచ్చి వెళ్లే విమానాలను రద్దు సస్పెండ్ చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ పేర్కొన్నది. ఏప్రిల్ 18వ తేదీ వరకు విమానాల రాకపోకలు ఉండదని, ఇరానియన్ ఎయిర్ స్పేస్ను కూడా వాడడం లేదని లుఫ్తాన్సా చెప్పింది.