నంద్యాల:నంద్యాలలో ఎస్‌.ఎన్‌ ఫంక్షన్‌ హాల్లో ముస్లిం మహిళలతో నారా భువనేశ్వరి మాట్లాడారు. పేద ప్రజలకు చాలా పథకాలు తెచ్చింది చంద్రబాబే. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్త్రీలపై అనేక దాడులు జరిగాయి. నంద్యాల అంటే గుర్తుకు వచ్చేది అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్య. వైసీపీ నాయకులు చేసే అరాచకాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు నాయడు మాట ఇస్తే మాట తప్పడని అన్నారు.
నూనేపల్లేలో రైల్వే గేట్‌ అండర్‌ పాస్‌ వేస్తాననీ వెయ్యలేదు. టీడీపీ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకి 80 టీఎంసీల నీళ్లు వదిలేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ ప్రజలకు నీరు కరువైంది. ఈ ప్రభుత్వంలో వైసిపి నాయకులు అధికంగా భూకబ్జాలకు పాల్పడ్డారు. టీడీపీ ప్రభుత్వం పదమూడు వేల టిడ్కో గృహాలు కట్టారని అన్నారు.టిడ్కో గృహాలను అర్హులైన పేద ప్రజలకు ఇవ్వకుండా వైసిపి నాయకులకు ఇచ్చుకున్నారు. టిడిపి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత టిడ్కో గృహాలను అర్హులైన పేద ప్రజలకు చంద్రబాబు అందజేస్తారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంటే తల ఎత్తుకొని చెప్పేవారు. పెట్టుబడులు పెట్టడానికి చాలా పెట్టుబడి సంస్థలు వచ్చేవి కానీ,ఇప్పుడు పెట్టుబడి సంస్థలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *