రాయచోటి మున్సిపాలిటీ నీటి సరఫరా వెలిగిళ్ళు స్కీమ్ ఇంటెక్ వెల్ &ఎగువ గొట్టివీడు మంచినీటి శుద్ధి కేంద్రాన్ని కమీషనర్ వాసు బాబు పరిశీలించారు.వెలిగిళ్ళు ఇంటెక్ వెల్ నందు మోటర్ల పని తీరు అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.రిజిస్టర్ లు పరిశీలించారు. గొట్టివీడు నీటిశుద్ధి కేంద్రం లో నీటి శుద్ధి పై ఆరా తీశారు.క్లోరిన్,ఆలమ్ వంటి నీటి శుద్ధి పదార్ధాలు సరైన మొతాదులో వాడాలని సిబ్బందికి సూచించారు.వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సరఫరా లో అంతరాయం కలగకుండా పక్కా ప్రణాళిక చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.ప్రజలకు అందించే నీటి శుద్ధి ప్రక్రియ లో నిర్లక్ష్యం గా ఉంటే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.ఈయన వెంట మున్సిపల్ AE కృష్ణా రెడ్డి,మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున,వెలిగిళ్ళు వాటర్ స్కీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *