గ్రూప్‌ 2 ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ పంపిణీ
మైనారిటీ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం
వైస్‌ ఛైర్మెన్‌ నజీర్‌ అహమ్మద్‌, వక్ఫ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు రియాజ్‌ అహమ్మద్‌
ఎమ్మిగనూరు: గ్రూప్‌ 2 ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యే నిరుద్యోగులైన ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ మైనారిటీ వెల్పేర్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌ 2 పోస్టులకు సంబంధించి ఎమ్మిగనూరు పట్టణంలోని అర్‌.ఎం.కె కోచింగ్‌ సెంటర్‌ లో ఉచిత కోచింగ్‌ ఇవ్వటమే కాకుండా గురువారం స్టడీ మెటీరియల్‌ పట్టణ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ నజీర్‌ అహమ్మద్‌, వక్ఫ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు రియాజ్‌ అహమ్మద్‌, వైసిపి పట్టణ అధ్యక్షుడు బుట్టారంగయ్య చేతుల విూదుగా ఉచితంగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. మైనారిటీ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమన్నారు. ఉచిత కోచింగ్‌ ను ఆర్‌ఎంకే వారు నిర్వహించడం సంతోషమని కొనియాడారు. కార్యక్రమంలో టౌన్‌ బ్యాంక్‌ ఛైర్మెన్‌ కొమ్మురాజు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ రుక్మాన్‌, అర్‌ఎంకే కోచింగ్‌ నిర్వాహకురాలు ఆశలుక్మాన్‌, విద్యార్థి సంఘం నాయకులు నరసప్ప, అబ్దుల్‌ రజాక్‌, మైనారిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *