అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా రాజంపేట వైకాపాలో వర్గాల వైరి పెరిగిపోయింది. పార్టీ దాదాపు రెండుగా చీలిపోయింది. అసైన్మెంట్ భూముల వ్యవహారంలో అనర్హులనుకు భూములు కట్టబెడుతున్నారంటూ ఓవర్గం ఆందోళన చేసింది. పార్టీ పెద్దలు, ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆవేదనతో అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు వైసీపీ నేతలు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నుంచి వైసీపీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, జేసీయెస్ కన్వీనర్ లు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి విషయం తీసుకెళ్లడం జరిగిందని వైసిపి నేతలు అంటున్ఆరు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను కూడా స్థానిక అధికారులు పక్కన పెట్టారని నేతలు విమర్శించారు. అర్హులకు న్యాయం చేయకపోతే వైసీపీకి సహకరించేది లేదని తేల్చి చెప్పారు.